పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని వరవకట్ట ప్రాంతంలో జామియా మసీదు సమీపంలో నూతనంగా నిర్మించబోయే అంజుమన్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ రోజు భూమిపూజ చేశారు. రూ. 4.42 కోట్ల తో నిర్మించబోయే 140 షాప్స్ నిర్మాణానికి ఆయన కొబ్బరికాయ కొట్టారు.
అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వీలైనంత త్వరగా, నాణ్యంగా కాంప్లెక్స్ నిర్మాణం, మసీదు నిర్మాణం కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, డీఈ శ్రీనివాస రావు, షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ ఖాజా వలి మాస్టర్, కాంప్లెక్స్ నిర్మాణ కమిటి చైర్మన్ రేహామ్ తుల్లా, కాలేషా వలీ, అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణ కమిటి సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు.