38.2 C
Hyderabad
May 5, 2024 19: 30 PM
Slider కడప

తెలుగు దేశంలో గెలిచిన మేడా ఇప్పుడు బాబుపై విమర్శలు చేస్తే ఎలా?

#venkatanarsaiah

తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా మొదటిసారిగా గెలుపొంది ఇప్పుడు వైసీపీలో చేరి మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కుటుంబం ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి లేనిపోని అవాకులు  మాట్లాడితే ప్రజలు హర్షించరని  కడప జిల్లా రాజంపేట నియోజక వర్గం ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర కళ్ళు గీత రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట నరసయ్య మీడియా సమావేశంలో అన్నారు.

ఇసుక మాఫియా ఎవరి కుటుంబం ద్వారా జరుగుతోందో రాజంపేట నియోజకవర్గ ప్రజలకు కడప జిల్లా ప్రజలకు తెలుసు అని అన్నారు.  అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి వందలాది ఎకరాలు నీటి మట్టం అయిపోయాయి అని,ఆ కుటుంబాలను వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి అని, 10 గ్రామాల ప్రజలు గృహాలు కోల్పోయి రోడ్లు పాలయ్యారని వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఓట్ల కోసం ఆ గ్రామాల వైపు వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు.

అన్నమయ్య డ్యాం తెగిపోతే అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు ప్రశ్నించారు. ఇసుక మాఫియా వందలాది టిప్పర్లు జెసిబి యంత్రాలు మునిగి పోతాయని గేట్లు ఎత్తలేదని ఆరోపించారు. డ్యామ్ అధికార యంత్రాంగం తప్పు చేశారా లేక మీ వైసిపి పార్టీ తప్పు చేసిందా ఒక్కసారి క్లారిటీగా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మేడా గంజాయి వనంలో నుండి తులసి వనం అన్న స్టేట్మెంట్ ప్రజల్లో బలంగా వెళ్లిపోయిందని రాబోయే ఎలక్షన్ లో మీరు గంజాయి వనంలో నుంచి వచ్చారా లేక తులసివనంలో నుంచి వచ్చారా ప్రజలు నిర్ణయిస్తారని ఇకనైనా చంద్రబాబుపై విమర్శలు మానుకొని ప్రజల సమస్యలకు ఇచ్చిన  చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలని హితవు పలికారు.

Related posts

డప్పు,చర్మ కళాకారులకు పింఛన్లు పంపిణీ

Bhavani

ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు

Satyam NEWS

రెండు వారాల ప్రాక్టీస్ ఓరియెంటెడ్ ఇంటర్న్‌షిప్

Bhavani

Leave a Comment