28.7 C
Hyderabad
May 6, 2024 07: 22 AM
Slider నిజామాబాద్

గజ్వేల్ వస్తామంటే భయమెందుకు?: ఎమ్మెల్యే రఘునందన్

#raghunandanrao

కేసీఆర్.. కామారెడ్డి ప్రజలు గజ్వేల్ అభివృద్ధి చూడటానికి వస్తామంటే భయమెందుకు అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్ స్టేషన్ కు తరలించడంతో రఘునందన్ రావు బిచ్కుందకు వెళ్లారు. రమణారెడ్డిని విడిపించుకుని కామారెడ్డికి చేరుకున్న రమణారెడ్డికి వేలాది మంది బీజేపీ శ్రేణులు భారీ స్థాయిలో ఘనస్వాగతం పలికారు.

దేవునిపల్లి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీ ద్వారా నిజాంసాగర్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. చౌరస్తాలో బహిరంగ సభలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. భద్రత మాదే.. బాధ్యత మాదే అని చెప్పే పోలీసులు రమణారెడ్డి ఏం తప్పు చేస్తే అరెస్ట్ చేశారో జిల్లా ఎస్పీ చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధి చూడాలని అందుకోసం బస్సులు తామే ఏర్పాటు చేస్తామని మహారాష్ట్రలో చెప్పిన కేసీఆర్ కామారెడ్డి నుంచి గజ్వేల్ అభివృద్ధి చూడటానికి వస్తామంటే ఎందుకు భయపడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు.

రమణారెడ్డి ఏమైనా తుపాకులు పట్టుకుని వస్తా అన్నాడా.. మేమేమైనా నక్సలైట్లమా.. నిషేధిత వ్యక్తులమా.. అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వస్తామన్నామా.. కోటి రూపాయలు ఎలా సంపాదించాలని అడిగామా.. అని నిలదీశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక శాసనం రాసుకోవాలని, 10 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో మీ నలుగురే పోటీ చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నామినేషన్ వేయడానికి వెళ్లే మమ్మల్ని పోలీసులను పెట్టి అడ్డుకోండన్నారు. నాడు ఆంధ్రుల పాలనలో కూడా ఇలాంటి నిర్బంధాలు జరగలేవన్నారు. ఎస్పీగారు. సిద్ధంగా ఉండండి.. కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు ఓడించి తీరతారు.. అప్పుడు మీరే ప్రత్యేక ఎస్కార్ట్ పెట్టి కేసీఆర్ ను ఫార్మ్ హౌస్ లో వదిలిపెట్టండని ఎద్దేవా చేశారు. 24 గంటల పాటు ఇల్లిగల్ గా అరెస్ట్ అయిన రమణారెడ్డిని చలి చీమలు చుట్టుముట్టి పామును చంపినట్టు విడిపించుకున్నామని, ఇకపై బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తే కామారెడ్డిలో జరిగినట్టే జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జమిలి ఎన్నికలు భారత ప్రభుత్వానికి కొత్త ఏమి కాదని, 2014 లో కూడా జమిలి ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.

దేశవ్యాప్తంగా ప్రజాధనం వృధా కాకుండా ఉండేందుకే జమిలి ఎన్నికల అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని, ఇప్పటికే దీనిపై రంనాథ్ కోవిడ్ ఆధ్వర్యంలో కమిటీ వేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, జిల్లా ఇంచార్జి బద్దం మహిపాల్ రెడ్డి, బాన్సువాడ నాయకులు మాల్యాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రఘురామతో సయోధ్యకు నలుగురు ఎంపిల రాయబారం?

Satyam NEWS

వినాయక లడ్డు చో్రీ

Bhavani

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల ఫిర్యాదు

Murali Krishna

Leave a Comment