సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు మండల కేంద్రము లోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం వెనక గోపురం నిర్మాణానికి, అయ్యప్ప స్వామి దేవస్థానంకు సి సి రోడ్డుకు సోమవారం హుజుర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్ రెడ్డి, శివాలయం చైర్మన్ భోగాల కొండారెడ్డి , అయ్యప్ప స్వామి టెంపుల్ చైర్మన్ సాముల శంభి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బసవయ్య, ప్రధాన కార్యదర్శి బేత వీరనాగిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బాలవెంకన్న , బుస్స శ్రీను , నియోజకవర్గ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపిటిసిలు సర్పంచులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.