IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద కార్యక్రమము జరిగింది. హైదరాబాద్ లోని ఉప్పల్, రామంతపూర్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నప్రసాద కార్యక్రమములో..ముఖ్య అతిథిగ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త విచ్చేసి, అమావాస్య అన్నప్రసాద కార్యక్రమం ను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అమావాస్య భోజనాలు అనేవి ప్రతి నెల దాదాపు 500 మందికి పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతుంది అన్నారు. అమావాస్య రోజు ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలకు అన్నదానం చేయడం, నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని, ఈరోజు అమావాస్య సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేస్తున్న
వారి సేవలు అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జోనగిరి శ్రీనివాసులు గుప్త, జనరల్ సెక్రటరీ సంబు పాండయ్య గుప్త, ట్రెసరర్ తాటి శ్రీనివాస్ గుప్త, అడిషనల్ ట్రెసరర్ పూరె.నాగేష్ గుప్త, గట్టు ప్రకాష్ గుప్త కొత్తపల్లి రమేష్ గుప్త, బూర్గు శ్రీనియ్య గుప్త, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు,ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.