అమావాస్య సందర్భంగా ఏర్పాటు చేసే అన్నప్రసాద కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. హైదరాబాద్ రామంతపూర్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రతి నెల అమావాస్య రోజున దాదాపు 500 మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనగిరి శ్రీనివాసులు గుప్త, సంబు పాండయ్య గుప్త, శ్రీనివాస్, నగేష్, ప్రకాష్, రమేష్, పబ్బ చంద్రశేఖర్ గుప్త, సంతోష్, శ్రీకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.