రోటరీ క్లబ్ ఆఫ్ నరసరావుపేట ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫిషియల్ విజిట్ లో భాగంగా ఆదివారం వినుకొండ రోడ్ లోని ఆర్.టి.సి.బస్టాండ్ లో తల్లులు పసిపిల్లలకు పాలు ఇచ్చు గదిని రోటరియన్ బత్తుల బాబు సహకారంతో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్.వి. హనుమంత రెడ్డి,ఆర్టీసీ డి.ఏం.అబ్దుల్ సలాం ప్రారంభించారు.
అనంతరం సత్తెనపల్లి రోడ్ లోని స్టేడియం ఎదురుగాఉన్న అమేజింగ్ చిల్డ్రన్స్ హోమ్ లో వారికి అవసరమైన రైస్ ప్యాకెట్స్, నిత్యవసర సరుకులను అందజేశారు. అనంతరం స్థానిక వినుకొండ రోడ్ లోని రోటరీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన విలేకరుల సమావేశం లో పాల్గొని క్లబ్ కార్యవర్గ సభ్యులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
తదుపరి సాయంత్రం జరిగే కోవిడ్ వారియిర్ అవార్డ్స్ ఫంక్షన్ లో కోవిడ్ సమయంలో ఎంతో సేవలందించిన డాక్టర్లను అలానే వివిధ రంగాలలో సేవలందించిన వారికి గవర్నర్ చేతుల మీదగా అవార్డ్స్ బహుకరణ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి వనమా పవన్ కుమార్, డి.జి. ఎన్.తాళ్ల రాజశేఖర్ రెడ్డి, జిలానిమాలిక్. మామిడి సుబ్బారావు, పులిపాటి రమేష్, తడువాయి హరి, సురేంద్ర, జమ్ముల రాధాకృష్ణ ,
గడ్డం పురుషోత్తం రాజా, పాశం కృష్ణారావు, మురారిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లిఖార్జునరావు తదితర రోటరాక్ట్ క్లబ్ సభ్యులున్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 3150 రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నరసరావుపేట నియూజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సేవా కార్యక్రమలు చేస్తున్నామని తెలిపారు. ముందుగా రోటరీ మాజీ కోశాధికారి దివంగత మాజీ మునిసిపల్ చైర్మన్ వనమా సుబ్బారావు కు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.