ఐక్యరాజ్య భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)కు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంస్కరణలపై అంతర్ప్రభుత్వాల చర్చలు (ఐజీఎన్) జరగాల్సిందేనని జీ4 దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ చర్చలు ఫలప్రదంగా జరిగితేనే సంస్కరణలకు అవకాశముంటుందని, అభిప్రాయ బేధాలు వస్తే ఇది తెగని వివాదంగా పరిణమిస్తుందని పేర్కొన్నాయి.
జీ4 సభ్యదేశాలుగా ఉన్న భారత్ సహా బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలన్నీ ఎప్పటి నుంచే యూఎన్ఎస్ఆర్లో సంస్కరణలను కోరుకుంటున్నాయి. శాశ్వత సభ్యత్వం అవసరమని వాదిస్తున్నాయి.