గర్భవతులు తీసుకోవలసిన న్యూట్రిషన్ గురించి ఆరోగ్య బోధకుడు దస్థిరాం గ్రామస్తులకు వివరించారు. నేడు బిచ్ కుంద లో డాక్టర్ మమత అద్వర్యంలో 48 మంది గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య బోధకుడు దస్థిరాం మాట్లాడుతూ ఎర్లీ ANC రిజిస్ట్రేషన్ ఆవశ్యకతను 4 మెడికల్ చెక్ అప్ ను వివరించారు. పాలకూర తోట కూర, మెంతెం కూర, బఛ్చాల కూర,లాంటి పత్ర హరితం కలిగిన ఆకు కూరలను తీసుకొని గర్భవతులు అనీమియా వ్యాధిని అధిగమించాలని తగిన సలహాలు సూచనలు ఇచ్చినారు.
ఈ కార్యక్రమములో గంగా మణి, బలబాయి ,ప్లారెన్సు ఆశ లు మొదలగు వారు పాల్గొన్నారు.