సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన కీర్తిశేషులు భోజనపల్లి శేషయ్య,ధర్మపత్ని సత్యవతి జ్ఞాపకార్ధం వారి కుమారుడు వేణు కుమార్, ధర్మపత్ని సుప్రియ,మనవడు హరి నందన్ గుప్తా,మనవరాలు మోక్ష నందిని ఆర్యవైశ్య సూత్రానికి 5 లక్షల 50 వేల రూపాయలు విలువ గలిగిన జనరేటర్ ఏర్పాటుకు విరాళంగా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం కమిటీ సభ్యులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చిన్న వృత్తిని ఎంచుకొని తన మనుగడ సాగిస్తూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జనరేటర్ బహుకరణ చేయటం అభినందనీయం అన్నారు.
త్యాగం చాటి వితరణకు ముందుకు వచ్చిన వేణు,సుప్రియ దంపతులు చాలా ఆదర్శవంతులని, మనకి ఎంత ఉంది కాదు చివరకు మిగిలేది దాన ధర్మాలే అని,శాశ్వతం అజరామరమని అన్నారు.
అనంతరం ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం కమిటీ తరపున సభ్యులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి,శాలువాతో సత్కరించారు.కుల దేవత వాసవి మాత అమ్మవారి,మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి కృపాకటాక్షాలు ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గెల్లి విద్యాసాగర్,కార్యదర్శి గుండా రమేష్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్