28.7 C
Hyderabad
April 27, 2024 06: 11 AM
Slider ముఖ్యంశాలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం

#malamahanadu

ప్రజాసంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ప్రతిపక్ష పార్టీల నేతలు అసత్య ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు హెచ్చరించారు.

తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ అధ్యక్షతన జరింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు హాజరై మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన అఫిడవిట్ సరైనదేనని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

పాలమూరు అభివృద్ధి ప్రదాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై లేనిపోని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రానున్న ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం తథ్యం అన్నారు.

దళితుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దళితుల కోసం పనిచేస్తున్న టి ఆర్ ఎస్ పార్టీకి తెలంగాణ మాల మహానాడు ఎప్పుడు అండగా ఉంటుంది అన్నారు రాబోవు  ఎలక్షన్లలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం తధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ మహబూబ్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాసయ్య జిల్లా కార్యదర్శి కాటన్ రాఘవేందర్ తిరుపతయ్య మంత్రి నవీన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరా ప్రసాద్ దిష్టబొమ్మ దహనం

Bhavani

16 నుంచి 22 వరకు చిరంజీవి, పవన్ ల జన్మదిన వారోత్సవాలు

Satyam NEWS

ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుళ్లు .. ముగ్గురు మృతి

Sub Editor

Leave a Comment