గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కోటప్పకొండ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ నేడు పరిశీలించారు.
అతి తక్కువ పుణ్య క్షేత్రాలలో మాత్రమే ఉండే గిరి ప్రదర్శనను కోటప్పగొండలో ప్రవేశ పెట్టేందుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కోటప్పకొండ అభివృద్ధి లో భాగంగా గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు, మొక్కలకు నీటి వసతి కోసం ఏర్పాటు చేస్తున్న బోర్ వెల్ పనులు వారు ప్రారంభించారు.
గిరి ప్రదక్షిణ రహదారి విస్తరణ లో భాగంగా ఇరువైపులా మొక్కల పెంపకం పనులను పరిశీలించి ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపిడివో బూసిరెడ్డి, ఎమ్మార్వో రమణ నాయక్, ఫారెస్ట్ రేంజర్, సెక్షన్ ఆఫీసర్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ రామకృష్ణ, ఏఈ యాసిన్ తదితర అధికారులు పాల్గొన్నారు.