28.7 C
Hyderabad
April 27, 2024 04: 40 AM
Slider మహబూబ్ నగర్

మంత్రులు ఎమ్మెల్యేలలాగా చేతులు కట్టుకుని నిలబడం

Elleni Sudhakararao

ఈ మూడు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొల్లాపూర్, నాగర కర్నూల్ జిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు పిలుపునిచ్చారు. పాత, కొత్త నాయకులను, జిల్లాలో రికార్డ్ స్థాయిలో ఉన్న నాయకులను అందరికి కలుపుకుని వెళ్లి అభివృద్ధి సాధిద్దామని ఆయన అన్నారు.

పార్టీలోకి ఇంకా ఎంతో మంది కొత్తవారు వస్తున్నారని అందరిని  కలుపు కొని ముందుకు  సాగుదామని సుధాకర్ రావు అన్నారు. సోమశిల సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారికి మొదటి అడుగు పడిందని, కేంద్ర మంత్రుల, శాఖల అధికారులతో ఫైల్ కదులుతుందని ఆయన అన్నారు.

జాతీయ రహదారి, సోమశిల సిద్దేశ్వరం వంతెన, 98 జీవో, వివిధ కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రాల కోసం పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులలాగా ముఖ్యమంత్రి ముందు చేతులు కట్టుకొని ఉండేది లేదని ఈ మూడు సంవత్సరాలు ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసి డిమాండ్లను నెరవేర్చుకుందామని సుధాకరరావు అన్నారు.

భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావును అంతక ముందు పార్టీ నాయకులు శాలువా,  బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో  అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ గౌడ్, రమేష్, మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్, పాన్గల్ మండలం  అధ్యక్షులు అన్వేష్, కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు కాకి సత్య నారాయణ గౌడ్, సాయి ప్రకాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాగర్జనకు 300 బస్సులు

Bhavani

మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే

Satyam NEWS

వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు

Satyam NEWS

Leave a Comment