కడపజిల్లా పుల్లంపేటలో వెలసివున్న శ్రీ పర్వతావర్థిని దేవీ సమేత శ్రీ శాంతి లింగేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
అందులో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకలు కుంకుమార్చనలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేదపండితులు చాపటి ఈశ్వరరావు, చిన్న స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
కరోనా కారణంగా స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయంలోపల ఊరేగింపు నిర్వహించనున్నారు.