గిరిజన సంక్షేమ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా పోరిక అశోక్ నాయక్ ను నియమిస్తున్నట్లు ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు,పత్తిపల్లి ఎంపీటీసీ సభ్యుడు నూనావత్ మహేష్ నాయక్ తెలిపారు.
ఈ మేరకు శనివారం అశోక్ నాయక్ కు నియమక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అశోక్ నాయక్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.