చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం, బెంగుళూరు రోడ్డులోని బిస్కట్స్ ఫ్యాక్టరి వద్ద కొద్ది సేపటి కిందట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో దంపతులతో పాటు 9ఏళ్ళ చిన్నారి దుర్మరణం చెందారు.
చనిపోయిన వారు మదనపల్లి వాసులుగా గుర్తించారు.
స్వంత పనులపై కుమార్తెను వెంటబెట్టుకుని బెంగుళూరు రోడ్డు బిస్కెట్ ఫ్యాక్టరీ వద్దకు ద్విచక్ర వాహనంలో వెళ్ళి తిరిగి వస్తుండగా అదే ప్రాంతాల్లో గుర్తుతెలియని వాహనం ఢీకొంది.
ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.