38.2 C
Hyderabad
May 2, 2024 21: 52 PM
Slider ప్రత్యేకం

ఉప్పల్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా ఆశీర్వదించండి

#uppal

ఉప్పల్  నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా ఆశీర్వదించండి అని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం  కాప్రా సర్కిల్ లో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. బుదవారం సర్కిల్ పరిధిలోని మీర్ పేట్ హెచ్ బీ కాలని డివిజన్ పరిధిలోని రాజీవ్ పార్క్, కృష్ణ నగర్, మంగాపురం, ఇందిరానగర్,బక్షిగూడ, వెంకటేశ్వర నగర్, తిరుమల నగర్ కాలనిలో పరమేశ్వర్ రెడ్డి స్ధానిక నాయకులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు.

ప్రచారానికి స్ధానిక ప్రజలు బ్రహ్మరథం పడుతూ, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ఎక్కడ చూసినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. అభివృద్ది కుంటుపడిందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో స్ధానిక ప్రజా ప్రతినిధులు పూర్తీగా విఫలం అయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజలను దోచుకోవడంలో ఉన్న శ్రద్ద, స్ధానిక సమస్యల పై లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగి పోయారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని,  రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను చేతి గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లను ప్రజలకు వివరిస్తూ, నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జలగం వెంకటేష్, బొజ్జ రాఘవ రెడ్డి, సీతారాం రెడ్డి, కొత్త అంజి రెడ్డి, పెద్ది శ్రీనివాస్ గుప్తా, పోలెపాక అంజయ్య, నరేందర్, శ్రీనివాస్ ముదిరాజ్, మల్లికార్జున్, భానురి నవీన్ గౌడ్, మహేందర్, రాయని ఉదయ్ కిరణ్, ప్రీతం, సాయి కృష్ణ, వేణు, నవీన్, ముంతాజ్, యూసుఫ్, హజీ, సాంబయ్య, మహేష్, రహీమ్, శివ, వెంకటేష్ బాబు, వినోద్, సురేష్ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

అత్యాచారానికి గురై ఆపై గర్భందాల్చిన మైనర్ బాలిక

Satyam NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ఖుష్బూ

Satyam NEWS

ఆదిలాబాద్ పర్యాటక రంగ అభివృద్ధి పై దృష్టిసారించండి…

Satyam NEWS

Leave a Comment