38.2 C
Hyderabad
May 3, 2024 19: 47 PM
Slider ప్రత్యేకం

సీఎం కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తున్న పౌల్ట్రీ రైతులు

#poultry

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు నామినేషన్ల బెడద తప్పేలా లేదు. ఇప్పటికే కాయితి లంబాడీల 1016 నామినేషన్లు వేస్తామని ప్రకటించగా నిరుద్యోగులు సైతం నామినేషన్స్ వేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నేడు పౌల్ట్రీ రైతులు సైతం తాము కూడా నామినేషన్లు వేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. నేడు జిల్లా కేంద్రంలో పౌల్ట్రీ ఫార్మర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు చికెన్ సెంటర్స్ అసోసియేషన్, ట్రేడస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని పౌల్ట్రీ రైతులకు పూర్తి మద్దతు ప్రకటించారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓన్ ఫార్మర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్ రావు, ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ పౌల్ట్రీ శక్తుల తీరుతో పౌల్ట్రీ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్పొరేట్ శక్తుల చేతిలో ధరల నిర్ణయంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పౌల్ట్రీ రంగాన్ని పూర్తిగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగానే పౌల్ట్రీ రంగానికి కూడా ఉచిత కరెంట్ సరఫరా చేయాలన్నారు. గ్రో ఇన్ చార్జెస్ ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు.

గతంలో సెంట్రల్ బోర్డు ద్వారా 50 శాతం సబ్సిడీ ఇచ్చేవారని, ప్రస్తుతం అదే విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మక్కలు పౌల్ట్రీ రంగానికి 28 శాతం సబ్సిడీకి ఇవ్వాలన్నారు. పౌల్ట్రీ ధరలను రైతులే నిర్ణయించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కామారెడ్డిలో 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించామన్నారు. రేపటి నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియలో విడతల వారిగా 100 నామినేషన్లు వేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విఠల్ రెడ్డి, చంద్రకాంత్, రాము, పౌల్ట్రీ రైతులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ఒలంపియాడ్‌ పరీక్షలో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

Satyam NEWS

బీజేపీ పతనం ప్రారంభం

Bhavani

ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల ట్రాన్స్ఫర్

Bhavani

Leave a Comment