ఆలేరు నియోజకవర్గ పరిధి లోని వరంగల్ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సర్వీస్ రోడ్లను ,అండర్ పాస్ లను నిర్మించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కోరారు .మంత్రి జగదీశ్ రెడ్డి ,టి .ఆర్ .ఎస్ ఎంపీ లతో పాటు సునీత మంగళవారం కేంద్ర మంత్రి ని కలిశారు .
ఆలేరు నియోజకవర్గ పరిధి లోని జాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం వినతి పత్రం సమర్పించారు .వంగపల్లి, సాయి గూడెం, జీడికల్ లోని చేపట్టిన జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని, ఇందుకోసం వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని ఆమె కోరారు .అధికారుల తో చర్చించి ఈ వినతి పత్రం లోని అంశాల పై నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్టు సునీత తెలిపారు .