31.2 C
Hyderabad
May 12, 2024 02: 54 AM
Slider నల్గొండ

జాతీయ రహదారిని అభివృద్ధి చేయండి

gongidi sunitha

ఆలేరు నియోజకవర్గ పరిధి లోని వరంగల్ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సర్వీస్ రోడ్లను ,అండర్ పాస్ లను నిర్మించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కోరారు .మంత్రి జగదీశ్ రెడ్డి ,టి .ఆర్ .ఎస్ ఎంపీ లతో పాటు సునీత మంగళవారం కేంద్ర మంత్రి ని కలిశారు .

ఆలేరు నియోజకవర్గ పరిధి లోని జాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం వినతి పత్రం సమర్పించారు .వంగపల్లి, సాయి గూడెం, జీడికల్ లోని చేపట్టిన జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని, ఇందుకోసం వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని ఆమె కోరారు .అధికారుల తో చర్చించి ఈ వినతి పత్రం లోని అంశాల పై నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్టు సునీత తెలిపారు .

Related posts

ట్విట్టు మడిచిన హీరో పోతినేని రామ్

Satyam NEWS

మెటర్నిటీ హెల్త్ అవార్డు గ్రహీతలకు అభినందన

Bhavani

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment