ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో పని చేసిన తాత్కాలిక ఉద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. 52 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె జరిగినపుడు వీరిని విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు ఉద్యోగాలలో చేరడంతో వీరిని తీసేశారు. తమను ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయాలని వీరు కోరుతున్నారు.
ఈ మేరకు దిల్ సుఖ్ నగర్ డిపోలో పని చేసిన తాత్కాలిక ఉద్యోగులు నేడు ధర్నా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఆర్టీసీలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందువల్ల ఆ పోస్టులలోకి తమను తీసుకోవాలని వారు కోరుతున్నారు.