రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ రుణ సదుపాయంలో ఏజెన్సీ ప్రాంతంలోని గౌడ కులస్తులకు స్థానం కల్పించాలని గార్ల మండల గౌడ, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు మండ రవి, కోల కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
గార్లలో జరిగిన సంఘం సభ్యుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల గౌడ, కల్లుగీత కార్మికులు భీమా, పెన్షన్, తదితర సంక్షేమ పథకాలను పొందలేక పోతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ, కల్లుగీత కార్మిక సంఘాల పట్ల వివక్షత వీడి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. గౌడ, కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో సభ్యులు భాగస్వామ్యం కావాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కత్తి సత్యం, తాళ్ళపల్లి కృష్ణ గౌడ్, తోడేటి విజయ రాముడు, టి. రవి, టి. నాగరాజు, కె. ఈశ్వర లింగం, తదితరులు పాల్గొన్నారు.