హైదరాబాద్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. “ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఇవాళి రోజు ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి మట్లాడుకున్నాం” అని కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వృద్ధి, హైదరాబాద్ లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను సత్యనాదెళ్లకు కేటీఆర్ వివరించినట్లు సమాచారం. కొత్త సాంకేతికతపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది.