ఉన్నతాధికారులు..ఉద్యోగస్తులతో కలెక్టరేట్ లో సత్యం న్యూస్.నెట్ కు కనిపించిన హడావుడి..!
ఓ వైపు చర్చలు..మరోవైపు ఆందోళనలు……..ఉన్నతాధికారులు..ఉద్యోగస్తులతో ఏపీలోని విజయనగరం కలెక్టరేట్ లో కనిపించిన హడావుడి ఇదీ. ఓవైపు పీఆర్సీ సాధనసమితి ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్ లో ఉద్యోగస్తులందరూ పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతుండగానే..మరోవైపు పలు ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు…ఏం చేయాలన్న దానిపై సమాలోచనలో పడ్డారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు శాఖా ఉన్నదాధికారి గెజిటెడ్ ఆఫీసర్ మినిహా శాఖలో పని చేస సూపరెంటెండెంట్ నుంచీ ఎల్డీసీ, యూడీసీ, గుమస్తా , ఇలాప్రతీ ఒక్క ఉద్యోగి పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.కానీ అదే సమయంలో జాయంటె కలెక్టర్ వెంకటరావు ఆధ్వర్యంలో జిల్లారెవిన్యూశాఖఅధికారి గణపతిరావు సమక్షంలో డీటీలతో డీఆర్ఓ ఛాంబర్ లోనే మీటింగ్ జరిగింది. రాష్ట్ర ఉద్యోగుల సమితి నిర్ణయించిన మేరకు…అమరావతి కేంద్రంలో ఇచ్చిన పిలుపు, తీసుకున్న నిర్ణయం ప్రకారమే… జిల్లాలో ఉన్నతాధికారులంతా నడుచుకోవాలని డీఆర్ఓ సమక్షంలో..జేసీతో జరిగిన రెవిన్యూ అధికారులు సంఘం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో కలెక్టరటే లో అన్ని శాఖల ఉద్యోగులను పీఆర్సీ సాధాన సమితి ఆదేశాలమేరకు….రెవిన్యూ ఉద్యోగుల సంఘం నేతలు మురళీ ఇతర ఉద్యోగస్తు అందరూ తమ,తమ కార్యాలయాలలో ఎక్కడిక్కడే పనులు నిలుపుదల చేసి…కలెక్టరేట్ ప్రాంగణం ముందుకు వచ్చిన తమ,తమ నిరసన తెలిపారు.