రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉద్యమంలా ముందుకు కొనసాగుతోంది. ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడానికి ప్రముఖులు, సెలబ్రిటీస్ ఉత్సాహం చూపుతున్నారు.
ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల తన భర్త విష్ణుప్రసాద్ తో కలిసి ఈరోజు జూబ్లీహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ ఈరోజు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని, సంతోష్ మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.
కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్ డౌన్ సమయంలో ఏదైనా మంచి పని చేశాము అంటే ఈరోజు ఈ మొక్కలు నాటడమేనని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మరో ముగ్గురికి ఈ చాలెంజ్ విసిరారు. చెల్లెలు శ్రీజ, అల్లు స్నేహ రెడ్డి, స్వప్న దత్ మూడు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.