40.2 C
Hyderabad
April 29, 2024 16: 08 PM
Slider ముఖ్యంశాలు

వాతావ‌ర‌ణ మార్పుల‌పై ప్ర‌పంచం ప్ర‌త్యేక దృష్టిపెట్టాలి

#primeministermodi

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నేడు హైద‌రాబాద్ ప‌ఠాన్‌చెరులోని అంర్జాతీయ మెట్ట పంట‌ల ప‌రిశోధ‌నా సంస్థ (ఇంట‌ర్నేష‌న‌ల్ క్రాప్స్ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ ఫ‌ర్ ద సెమీ ఆరిడ్‌ట్రాపిక్స్ – ఇక్రిశాట్) 50 వ వార్షికోత్స‌వాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి గ్ర‌హ‌ర‌క్ష‌ణ‌కు సంబంధించి వాతావ‌ర‌ణ మార్పుల ప‌రిశోధ‌నా కేంద్రాన్ని, ఇక్రిశాట్ రాపిడ్‌జ‌న‌రేష‌న్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ రెండు స‌దుపాయాల‌ను ఆసియా, స‌బ్ -స‌హ‌రాన్ ఆఫ్రికాలోని చిన్న రైతుల‌కు అంకితం చేశారు. ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌త్యేకంగా రూపొందించిన ఇక్రిశాట్ లోగోను, ఈ ఉత్స‌వాల సంద‌ర్భంగా తీసుకువ‌చ్చిన స్మార‌క త‌పాలా బిళ్ల‌ను ఆవిష్క‌రించారు. తెలంగాణా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్  త‌మిళ సై సౌంద‌ర్ రాజ‌న్‌, కేంద్ర మంత్రులు న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌, జి.కిష‌న్‌రెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

వ‌సంత పంచ‌మి ప‌ర్వ‌దినాన్ని గుర్తుచేసుకుంటూ ఇక్రిశాట్ 50 వ‌సంతాల  ఉత్స‌వాల సంద‌ర్బంగా  వారికి అభినంద‌న‌లు తెలిపారు. ఇక్రిశాట్ కు దేశానికి రాగ‌ల 25 సంవ‌త్స‌రాలు ఎంతో కీల‌క‌మైన‌వ‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, నూత‌న ల‌క్ష్యాలు నిర్దేశించుకుని వాటిసాధ‌న‌కు కృషి చేయాల‌న్నారు. ఇండియాతో స‌హాప్ర‌పంచంలో చాలా భాగానికి వ్య‌వ‌సాయ రంగంలో ఇక్రిశాట్ అందిస్తున్న చేయూత‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసించారు. నీరు, నేల నిర్వ‌హ‌ణ , పంట ర‌కాల మెరుగుద‌ల‌, పంట‌ల వైవిధ్యం, ప‌శుగ‌ణ స‌మ్మిళిత‌త్వం వంటివాటి విష‌యంలో ఇక్రిశాట్ పాత్ర‌ను ఆయ‌న కొనియాడారు. రైతుల‌ను మార్కెట్ ల‌తో అనుసంధానం చేసేందుకు అనుస‌రిస్తు స‌మ‌గ్ర‌విధానాల‌ను , ప‌ప్పుధాన్యాల‌నుప్రోత్స‌హించ‌డాన్ని , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణాల‌లో శ‌న‌గ పంట‌ను ప్రోత్స‌హించ‌డంవంటివాటిని ఆయ‌న కొనియాడారు. “మీ ప‌రిశొధ‌న‌లు, సాంకేతిక‌త వ్య‌వ‌సాయం సుల‌భ‌త‌రం, సుస్థిర‌త సాధించ‌డానికి ఉప‌క‌రించింద‌”ని ‌న‌రేంద్ర మోదీ అన్నారు.

వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల తీవ్ర ప్ర‌భావానికి లోన‌య్యేవారు, త‌క్కువ నిధులు క‌లిగి,అభివృద్ధిలో వెనుక‌బ‌డి వున్న ప్ర‌జ‌ల‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.అందువ‌ల్ల వాతావ‌ర‌ణ మార్పుల‌పై ప్ర‌పంచం ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని ఇండియా కోరుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. లైఫ్ స్ట‌యిల్ ఫ‌ర్ ఎన్విరాన్ మెంట్ -ఎల్.ఐ.ఎఫ్‌.ఇ (లైఫ్‌) గురించి . పి-3 విశ్వ అనుకూల ప్ర‌జా ఉద్య‌మాలు, 2070 నాటికి ఇండియా నెట్‌జీరో ల‌క్ష్యాల గురించి ప్ర‌దాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ”  ఈ విశ్వానికి అనుకూల‌మైన ప్ర‌జా ఉద్య‌మం ప్ర‌తి క‌మ్యూనిటీని, ప్ర‌తి వ్య‌క్తిని వాతావ‌రణ మార్పుల విష‌యంలో బాధ్య‌త‌తో వ్య‌వ‌హరించేలా అనుసంధానం చేస్తుంది. ఇది కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాదు, ఇది భార‌త ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌లో ప్ర‌తిఫ‌లిస్తోంది “అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

దేశంలో ఆగ్రో క్లైమాటిక్ జోన్లు, ఆరు రుతువుల గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ వ్య‌వ‌సాయ‌రంగానికి సంబంధించి ప్రాచీన అనుభ‌వాల‌ను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.  వాతావ‌ర‌ణ మార్పుల‌నుంచి రైతుల‌ను ర‌క్షించేందుక ఇండియా  ప్ర‌ధాన దృష్టి మూలాల‌లో అనుసంధాన‌మ‌వుతూ, భ‌విష్య‌త్‌కు ముంద‌డుగు వేయ‌డ‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. మా దృష్టి 80 శాతంపైగా ఉన్న రైతుల‌పై ఉంది. వ‌రు చిన్న చిన్న రైతులు. వారు ఎంతో విలువైన వారు అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

మారుతున్న భార‌త‌దేశానికి సంబంధించి మ‌రో కోణం గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, డిజిట‌ల్ వ్య‌వ‌సాయం భార‌త‌దేశ భ‌విష్య‌త్ అని అన్నారు. ప్ర‌తిభ‌క‌లిగిన భార‌తీయ యువ‌త ఈ రంగంలో ఎంతో కృషి చేయ‌గ‌ల‌ద‌న్నారు. పంట అంచ‌నా, భూరికార్డుల డిజిటైజేష‌న్‌, పురుగుమందులు, పోష‌కాల‌ను డ్రోన్ల ద్వారా వెద‌జ‌ల్ల‌డం వంటి వాటిలో సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ‌ వాడకం పెరిగింద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు .  డిజిట‌ల్ సాంకేతిక‌త ద్వారా రైతుల‌కు సాధికార‌త క‌ల్పించేందుకు ఇండియా కృషి నానాటికి పెరుగుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.

అమృత్ కాల్‌లో ఇండియా వ్య‌వ‌సాయంలో ఉన్న‌త‌స్థాయివృద్ధితో కూడిన‌ స‌మ్మిళ‌త వృద్ధిపై దృష్టిపెడుతున్న‌ద‌ని అన్నారు. స్వ‌యం స‌హాయ‌క బృందాల ద్వారా వ్య‌వ‌సాయ‌రంగంలో మ‌హిళ‌ల‌కు మ‌ద్ద‌తునివ్వ‌డం జ‌రుగుతోంద‌న్నారు. జ‌నాభాలోని ఎక్కువ‌మందిని పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డేసి వారికి మెరుగైన జీవ‌నాన్ని క‌ల్పించ‌గ‌ల శ‌క్తి వ్య‌వ‌సాయ రంగానికి ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఈ అమృత్ కాలం రైతుల‌కు భౌగోళికంగా సంక్లిష్టంగా ఉన్న అంశాల‌లోనూత‌న అవ‌కాశాల‌ను క‌ల్పించ‌నున్న‌ద‌న్నారు.

ఇండియా ద్వంద్వ‌ వ్యూహంతో ప‌నిచేస్తున్న‌ద‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, ఒక‌వైపు పెద్ద మొత్తంలో భూమిని నీటి పొదుపుద్వారా ,న‌దుల అనుసంధానం ద్వారా సాగులోకి తెస్తున్నామ‌ని అన్నారు.  త‌క్కువ నీటిపారుద‌ల ఉన్న‌చోట‌ సూక్ష్మ నీటిపారుద‌ల ద్వారా నీటి వాడ‌కంలో స‌మ‌ర్ధ‌త‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. మ‌రోవైపు వంట నూనెల విష‌యంలో స్వావ‌లంబ‌నకు జాతీయ మిష‌న్‌ గురించి ప్రధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ఈమిష‌న్ పామాయిల్ విస్తీర్ణాన్ని 6 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు పెంచేందుకు ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంద‌న్నారు. ఇది భార‌తీయ రైతుల‌కు ప్ర‌తి స్థాయిలో  ప్ర‌యోజ‌న‌క‌రం కానున్న‌ద‌ని  ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణా రైతుల‌కు మేలు చేస్తుంద‌ని అన్నారు. పంట కోత అనంత‌ర అవ‌స‌రాల‌ను బ‌లోపేతం చేయ‌డం అంటే, కోల్డ్ చెయిన్ స్టోరేజ్ సామ‌ర్ధ్యాన్ని 35 మిలియ‌న్ ట‌న్నులకు చేర్చ‌డం, ల‌క్ష‌కోట్ల రూపాయ‌ల‌తో వ్య‌వ‌సాయ మౌలిక స‌దుపాయాల నిధిని ఏర్పాటు చేయ‌డం వంటి చ‌ర్య‌లు తీసుకున్న విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి వివ‌రించారు.

ఇండియా ఎఫ్‌.పి.ఒలు ఏర్పాటు చేయ‌డం, వ్య‌వ‌సాయ వాల్యూ చెయిన్‌ను ఏర్పాటు చేయ‌డంపై దృష్టిపెడుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. చిన్న రైతుల‌ను అప్ర‌మ‌త్త‌తో కూడిన శ‌క్తిమంత‌మైన మార్కెట్ శ‌క్తిగా తీర్చిదిద్దేందుకు వారిని వేలాది ఎఫ్‌.పి.ఒలుగా సంఘ‌టితం చేస్తున్నామ‌న్నారు.

ఇండియా ల‌క్ష్యం కేవ‌లం ఆహార‌ధాన్యం ఉత్ప‌త్తినిపెంచ‌డం కాద‌ని, ఇండియాకు ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆహార భ‌ద్ర‌తా కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు స‌రిప‌డినంత ఆహార‌ధాన్యాలు ఉన్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. మేం ఆహార భ‌ద్ర‌త‌పై దృష్టిపెట్ట‌డంతోపాటు పౌష్టికాహార భ‌ద్ర‌త‌పై దృష్టిపెడుతున్నాం. ఈ దార్శ‌నిక‌త‌తో మేం గ‌త 7 సంవ‌త్స‌రాల‌లో బ‌యో ఫోర్టిఫైడ్ ర‌కాల‌ను రూపొందించాం అని అన్నారు. ఇక్రిశాట్ ఒక అంత‌ర్జాతీయ సంస్థ‌. ఇది ఆసియా, స‌బ్ స‌హ‌రాన్ ఆఫ్రికా అభివృద్ధికి వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న‌లు చేస్తుంది. ఇది మెరుగైన పంట ర‌కాలు, హైబ్రిడ్ వంగ‌డాల వంటి వాటిని రైతుల‌కు అంద‌జేయ‌డం ద్వారా వారికి తోడ్ప‌డుతుంది. అలాగే చిన్న రైతులు, మెట్ట ప్రాంత రైతులు వాతావ‌ర‌ణ మార్పులు త‌ట్టుకునేందుకు తోడ్పాటు నందిస్తుంది.

Related posts

పల్నాడు ప్రాంతంలో ఇక మెరుగైన వైద్య సౌకర్యాలు

Satyam NEWS

చట్టంపై వినియోగదారులకు అవగాహన ఉండాలి

Satyam NEWS

కరోనా బాధితులను పట్టించుకోని ప్రభుత్వం: ప్రవేట్ ప్రాక్టీసులో డాక్టర్లు

Satyam NEWS

Leave a Comment