నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆంధ్ర పాలకుల అక్రమ కేసులు మరోపక్క పోలీసుల లాఠీ దెబ్బలు స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమించిన ఉద్యమంలో అమరుల త్యాగాని కల్వకుర్తి పట్టణంలో మరిచారు.
నేడు తెలంగాణ రాష్ట్ర ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అమరుల స్థూపానికి ఒక్క పువ్వు కూడా నోచుకోలేని పరిస్థితి. వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల తో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో అమరవీరుల స్తూపానికి కనీసం ఒక్క పూలమాలను వేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇట్టి విషయాన్ని పాలకులారా నిర్లక్ష్యం తగునా అని సోషల్ మీడియా ద్వారా పలువురు ప్రశ్నిస్తున్నారు