రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవడం లేదని బీజేపీ నేత సోము వీర్రాజు తప్పుబట్టారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ, యూత్ పాలసీని ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. కోవిడ్ సాకుతో ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ, యూత్ పాలసీని ఎందుకు ప్రవేశపెట్టడం లేదని నిలదీశారు. స్పోర్ట్స్ పాలసీ పెట్టె వరకు బీజేపీ పోరాటం చేస్తుందని వీర్రాజు తెలిపారు.
previous post