37.2 C
Hyderabad
May 6, 2024 12: 48 PM
Slider మహబూబ్ నగర్

జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి

#Journalist Monoj 2

కరోనా వైరస్ బారిన పడి అకాల మరణం చెందిన టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం కనీసం రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని టీ యూ డబ్ల్యు జె  హెచ్ 143 యూనియన్ కొల్లాపూర్ తాలూకా ప్రధాన కార్యదర్శి  Md ముస్తాక్ పాషా డిమాండ్ చేశారు.

మనోజ్ మరణ వార్త రాష్ట్ర జర్నలిస్టులోకం జీర్ణించుకోలేనిదాని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులకు ఇలా జరగడం అన్యాయమని ఆయన అన్నారు. సమాజంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించి న్యాయానికి అండగా నిలుస్తూ జర్నలిస్ట్  గా బాధ్యతలు నిర్వహిస్తునే భయంకరమైన కరోనా వైరస్ బారిన పడి మృతి చెందడం శోచనీయమని ఆయన అన్నారు.

కరోనాతో మరణించిన మనోజ్ కుమార్ కుటుంబానికి  ప్రభుత్వం అండగా నిలిచి కనీసం రూ.50 లక్షల ఎక్సగ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన కోరారు.

Related posts

బీజేపీకి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ

Sub Editor

పునాది నుంచే విద్యా వ్యవస్థ పటిష్టతకు చర్యలు

Bhavani

భూ ఆక్రమణలు చేస్తే సహించం

Bhavani

Leave a Comment