బిజెపి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మీడియా ఇన్ చార్జిగా విశాల్ ఖండ్రే ను నియమించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి బోడ జనార్దన్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు j B పౌడెల్ అధ్యక్షత వహించారు. జిల్లా మీడియా ఇంచార్జి తో బాటు అసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ గా దిగాదేతుల రాధిక ను, సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ ఇంచార్జ్ గా గోలెం వెంకటేష్ ను కూడా నియమించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన విశాల్ ఖండ్రే, రాధిక, వెంకటేష్ మాట్లాడుతూ తమపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా లో పార్టీ బలోపేతానికి పని చేస్తామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ, భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రచారం చేస్తూ, మీడియా మిత్రుల తో మమేకమై పని చేస్తామని అన్నారు. ఈ బాధ్యత అప్పగించిన జిల్లా అధ్యక్షులు j B పౌడెల్ కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిఫాబాద్ , సిర్పూర్ ఇంచార్జ్ లు ఆత్మ రామ్ నాయక్, కొత్త పెళ్ళి శ్రీనివాస్ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, గుల్బమ్ నారాయణ, సోల్లు లక్ష్మీ, సుదర్శన్ గౌడ్, మాలిక్, ఆంజనేయులు గౌడ్, గుమ్ముల తదితరులు పాల్గొన్నారు.