23.7 C
Hyderabad
May 8, 2024 05: 00 AM
Slider నల్గొండ

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని సిఐ పోలే సైదులు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల లింగగిరి గ్రామంలోని ఎస్సీ కాలనీ లోని ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 70 మంది విద్యార్థులకు 20 వేల రూపాయల విలువగల వ్రాత పుస్తకాలను మంగళవారం అందజేశారు.

తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న ఉచిత విద్య,ఉచిత భోజనం, దుస్తులు,పుస్తకాలు తదితర వాటిని సద్వినియోగం చేసుకొని తమ పిల్లల అభ్యున్నతికి బాటలు వేసుకోవాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందజేసేందుకు దాతలు ముందుకు రావాలని అన్నారు.అనంతరం వ్రాత పుస్తకాలను అందజేసిన సిఐ పోలే సైదులు ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎస్.వెంకటరెడ్డి, శీను నాయక్,రవి,లక్ష్మయ్య, ఉపాధ్యాయులు ఇందిరాల జ్యోతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

జగన్ సర్కార్ కు హైకోర్ట్ లో మరోసారి చేదు అనుభవం

Satyam NEWS

వ్యక్తి ఆరాధనకు పరాకాష్ట: దుర్గా మాత పక్కన దీదీ విగ్రహం

Satyam NEWS

చట్టాలను రేప్ చేస్తున్న కుల దురహంకారం

Satyam NEWS

Leave a Comment