ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు రాష్ట్ర గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ ఆమోద ముద్ర వేశారు. ఈ అంశం పై అనేకరకల వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు గవర్నర్ ఆమోదంతో ప్రస్తుతం ఈ వివాదానికి తెరపడినట్లే. వెంటనే ఈ అంశంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ జీవో జారీతో ఎన్టిఆర్ హెల్త్ యునివర్సిటి డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు అధికారికంగా మారినట్లైంది.
next post