ఈవీఎం గోదాం వద్ద పటిష్ట పర్యవేక్షణ, నిఘా కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆయన వివి పాట్, ఈవియం గోడౌన్ తనిఖీ చేశారు. తనిఖీలో గోదాం కు వేసిన తాళం సీలును పరిశీలించారు. సీసీ కెమెరాలలో రికార్డు అవుతున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోదాం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈవియం గోదాం తనిఖీ చేయడం జరుగుతున్నదని చెప్పారు. గోదాం తనఖీ నివేదికను ఎన్నికల సంఘ కార్యాలయానికి పంపాల్సిందిగా ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులు ఎంఏ రాజును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఏవో గన్య ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులు ఎంఏ రాజు, తహసిల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.