31.2 C
Hyderabad
May 11, 2024 23: 41 PM
Slider ముఖ్యంశాలు

కర్నాటక కల్లుగీత కార్మికుల ర్యాలీకి తరలి వెళ్లిన గౌడ సంఘాలు

#Karnataka Kallugeeta

కర్నాటక రాష్ట్రంలో కల్లు గీత వృత్తిని పునరుద్ధరించాలని కర్ణాటక ఈడిగ, గౌడ సామాజిక వర్గాలకు మద్దతుగా స్వామి ప్రణవానంద నిర్వహిస్తున్న పాదయాత్ర కు సంఘీభావం గా వెళుతున్న తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ కి ఘన స్వాగతం లభించింది.

తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాల ముఖ్య నాయకులతో సుమారు 200 వాహనాలతో వేలాదిమంది గౌడ ప్రతినిధులు ర్యాలీ గా కర్నాటక రాష్ట్రం లోని గుల్బర్గా కు హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లారు. మోహినాబాద్, చేవెళ్ల,మన్నే గూడ చౌరస్తా, పరిగి, కొడంగల్ లలో అడుగుడుగున గౌడ సంఘాల నాయకులు మంత్రి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం చలో కర్ణాటక పర్యటన విజయవంతం చేయడానికి మద్దతు గా కర్నాటక రాష్ట్ర JDS సేడం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ – కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వద్ద మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ కి ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘాల ముఖ్య నాయకులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, బాలగొని బాలరాజు గౌడ్,ప్రతాని రామకృష్ణ గౌడ్,మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్, కూరేళ్ళ వేములయ్య గౌడ్, నాసగోని రాజయ్య గౌడ్, బత్తిని కీర్తి లతగౌడ్, సంజయ్ గౌడ్, విజయ గౌడ్, గీత గౌడ్, సిద్ధిపేట పద్మ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆ ప్రభుత్వం నెలకొల్పింది..ఈ ప్రభుత్వం ఆధునీకరించింది..!

Satyam NEWS

మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ దీక్షకు రఘురామ మద్దతు

Satyam NEWS

స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో ఖమ్మం ఫస్ట్

Murali Krishna

Leave a Comment