తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ, భారతీ ఫౌండేషన్ వారి సహకారంతో వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు హైస్కూలు విద్యార్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, తెలంగాణ ఆధ్వర్యంలో ఆంగ్ల భాషలో విద్యార్థుల పరిజ్ఞానం కోసం 8 ,9 వ తరగతి విద్యార్థులకు స్పెల్లింగ్ విజార్డ్ & స్టోరీ టెల్లింగ్ పోటీలు నిర్వహించారు. మొదటి టెస్ట్: ఇంగ్లీష్ భాషలో పదాలు, పదాల అమరిక మరియు పదాల స్పెల్లింగ్ పోటీ పరీక్ష లో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో మొదటి బహుమతి – భార్గవి, రెండవ బహుమతి – అజిత్ కుమార్ సాధించారు. రెండవ పోటీ: ఆంగ్లభాషలో స్టోరీ టెల్లింగ్ – కథలో పోటీ లో విద్యార్థులు పాల్గొని ఇంగ్లీష్ భాషలో వివిధ రకాల కథలను చెప్పారు. ఈ పోటీ లో, మొదటి బహుమతి – భార్గవి రెండవ బహుమతి – సంతోష్ గెలుపొందారు. వీరు జనవరి 7, 2023 నాడు జరిగే మదనపురం మండల స్థాయి పోటీలకు హజరు కావాలి. ఈ పోటీలను అజ్జకొల్లు హై స్కూలు ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు
జి.చంద్రశేఖర్ రాజు అత్యంత ఆసక్తికరంగా నిర్వహించారు. ఆంగ్ల భాషలో విద్యార్థులకు ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఇంగ్లీష్ భాష పట్ల ఆసక్తి పెరిగి, నిష్ణాతులుగా తయారై , భవిష్యత్తు లో ఉత్తమ పౌరులుగా వెలుగొందాలని ప్రధానోపాధ్యాయుడు అతీక్ అహ్మద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్