ఏపీలో బాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ ప్రముఖ న్యాయవాది, మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ చేస్తున్న ఆకాంక్ష దీక్ష కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామ కృష్ణంరాజు సంఘీభావం వ్యక్తం చేశారు.
మాటిచ్చిన విధంగా త్వరలో ఉద్యోగాల నియామకాలు జరుగుతాయని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. నిరుద్యోగ సమస్య వంటి కీలక అంశాలవైపు సీఎం దృష్టి సారించేలా తాను కూడా ప్రయత్నిస్తున్నానని రఘురామ అన్నారు.
శ్రావణ్ కుమార్ ఆకాంక్ష దీక్ష విజయవంతమై నిరుద్యోగ యువత కష్టాలు తీరాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.