ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ కు సంబంధించి పరీక్షలు జరిగాయి. ఈ మేరకు దేవాదాయ శాఖలో గ్రేడ్ -3 కార్యనిర్వహణ అధికారుల పోస్టుల్లో నియామకం కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. అందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
నగరంలోని 13 కేంద్రాల్లో నిర్వహించిన రాత పరీక్షకు 5143 మంది అభ్యర్ధులు హాజరు కావలసి వుండగా 2917 మంది అభ్యర్ధులు హాజరయ్యారని, మరో 2226 మంది పరీక్షకు హజరు కాలేదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు వెల్లడించారు. అంతకు ముందు నగరంలోని తోటపాలెంలోని సత్య డిగ్రీ, పి.జి. కళాశాల కేంద్రాల్లో, గాయత్రి జూనియర్ కళాశాల కేంద్రంలో జరుగుతున్న పరీక్షలను డి.ఆర్.ఓ. తనిఖీ చేశారు.