40.2 C
Hyderabad
April 28, 2024 16: 42 PM
Slider ముఖ్యంశాలు

ఈ నెల 26న ఛలో విజయవాడ…!

#soniasmall

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా పై పెట్టిన ఈడీ కేసులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పార్టీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆదేశాల మేరకు ఛలో విజయవాడకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఛలో విజయవాడ కు తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు రమేష్ కోరారు.

ఎడ్ల ఆదిరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు నగర పార్టీ అధ్యక్షుడు సతీష్ కూడా మాట్లాడారు. దేశ ప్రధాని గా అవకాశం వచ్చినా పార్టీ కోసం దేశ ప్రజల కోసం తృణప్రాయంగా వచ్చిన పదవినే వదలుకున్న అధినేత్రి సోనియా గాంధీ అని అన్నారు.

తాజాగా ఈడీ కేసుల పెట్టి అక్రమంగా అన్యాయం గా పార్టీ అధినేత్రి ని ఇరికించడంతో బీజేపీ వైఖరి ఏంటో అందరికీ తెలిసిందన్నారం.కాబోయే దేశ ప్రధాని రాహుల్ యేనని..మోడీ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా..2024లో కాంగ్రెస్ పార్టీ యే గద్దె నెక్కడం ఖాయమన్నారు. ఈడీ కేసులను విరమించుకునేంతవరకు..కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని హెచ్చరించారు.

Related posts

మహిళలకు అన్ని రంగాలలో సమూచిత స్థానం దక్కాలి

Murali Krishna

బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికులు సిద్ధం కావాలి

Bhavani

పి.వి రావు మాల మహానాడు అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం

Satyam NEWS

Leave a Comment