మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదర్శనగర్ లో MLA క్వార్టర్స్ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప శరణు ఘోష తో ఆ ప్రాంతం మొత్తం మార్మోగింది. అయ్యప్ప మహా పడిపూజలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు,
జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, మున్సిపల్ శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారి, MLC తాతా మధు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.