కడప జిల్లా మైదుకూరు రాయల్ కూడలి లో చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షుడు గోశెట్టి రామ గోవింద్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల ను ఘనంగా నిర్వహించారు. చిరంజీవి జన్మదిన సందర్భంగా మెగా అభిమానులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.
మిలిటరీ మాజీ కల్నల్ కందనూరు గోపి బిజెపి మైదుకూరు ఇన్చార్జ్ మాచనూరు సుబ్బరాయుడు మాధవరాయ స్వామి ఆలయ చైర్మన్ భూమిరెడ్డి సుబ్బరాయుడు ప్రముఖ వైద్యుడు బద్వేల్ సుబ్బరాయుడు ప్రముఖ న్యాయవాది కామనూరు శ్రీనివాసులు మరియు జనసేన నాయకుడు చిలుము గారి కృష్ణమూర్తి చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా జన్మించి సినీ పరిశ్రమలో ప్రవేశించి శ్రమించి అంచల్ అంచలుగా ఎదిగి మకుటం లేని మహారాజుగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి చేసిన సేవలను కొనియాడారు.
కరోనా కష్టకాలంలో సినిమా 24 విభాగాలలో కార్మికులకు చేసిన సేవాసహాయాలను గుర్తు చేసుకున్నారు మిగిలిన సినీ హీరో అభిమానులతో స్నేహంగా ఉండాలని కోరుకున్నారు. కష్టంలో ఉన్న వారిని చిరంజీవి ఏ విధంగా అయితే సహాయపడతారో అదేవిధంగా ఎల్లప్పుడూ అందరికీ సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.