మూడు నెలల పాటు విదేశాల్లో యోగ విద్య ను ప్రచారం చేసి స్వదేశీ ఆగమనం సందర్భంగా స్వస్థలమైన కామన్నవలస స్వామి శ్రీ రామానంద యోగజ్ఞానాశ్రమంకు విశాఖ నుంచీ కారులో వచ్చిన శ్రీగురూజీ దంపతులకు ఎరుకుల పాకల వద్ద మేళతాళాలు… కోలటాలతో శిష్యులు యావన్మంది స్వాగతం పలికారు. కామన్నవలస ప్రధాన రహదారి నుంచీ ఊరేగింపుగా ఆశ్రమం కు తీసుకు వచ్చారు… శిష్యులందరూ. ఇక ఆశ్రమం మెయిన్ గేట్ వద్ద శ్రీగురూజీ దంపతులకు లక్ష్మీ, సరోజ, అరుణలు ఎర్ర నీశ్లతో దిష్టి తీసారు.సమాధి మందిరం వద్ద శ్రీగురూజీ పుత్రుడు ఆయన భార్య తేజస్విని, శివరామకృష్ణ లు పూర్ణకుంభంతో స్వాగతం పలికి కాళ్లు కడిగారు.మరికాసేపట్లో శ్రీగురూజీ విదేశీ పర్యటన.. అక్కడ యోగ విద్య ప్రచారం ఎలా జరిగిందో ప్రసంగం ద్వారా తెలియపరచనున్నారు.
previous post