జనసేన అధినేత పవన్ కల్యాణ్… కు విజయనగరం ప్రజలు ఘన స్వాగతం పలికారు. విశాఖ నోవేటల్ నుంచీ ఈ ఉదయం తొమ్మిది కి బౌన్సర్ ల కాన్వాయ్ తో బయలుదేరి న పవన్… విజయనగరం జిల్లా లో అయినాడ..చెల్లూరు..వై జంక్షన్ ..వీ.టీ.అగ్రహారం గాంధీ విగ్రహం వద్దకు వచ్చేసరికి… పదకొండు అయ్యింది.
అక్కడ నుంచీ విజయనగరం జనసేన పార్టీ అధినేత్రి యశస్వి… స్వాగతం పలకడం తో..బాబులకే బాబు కల్యాణ్ బాబూ అంటూ పార్టీ యువత.. కేకలు వేసుకుంటూ ర్యాలీ గా విజయనగరం ఎత్తు బ్రడ్జికి చేరుకున్నారు… దారిపొడవునా… బైక్ లు..పార్టీ జెండాలతో… జనసేన అధినేత కు కాన్వాయ్ గా గుంకలాం బయలుదేరారు.
ఇక బందోబస్తు కు సంబంధించి…ఎస్పీ దీపికా ఆదేశాలతో సీఐ వెంకటావు…లక్ష్మణరావు.. రాజాం సీఐ …అలాగే ట్రాఫిక్ ఎస్ఐ దామోదర రావులతో పోలీసులు భారీ బందోబస్తు చేశారు.