విజయనగరం నుంచీ గుంకలాం కు…గంటన్నర…
విజయనగరం నుంచీ గుంకలాం కు…పట్టమని…ఏడు నిమిషాల ప్రయాణం… కానీ జనసేన పార్టీ అధినేత.. విజయనగరం నుంచీ గుంకలాం వెళ్లేందుకు…. దాదాపు రెండు గంటలు పట్టింది. ఉదయం వై జంక్షన్ వద్దకు…రమారమి 11 గంటలకు చేరిన పవన్ కల్యాణ్ ..గుంకలాం లో జగనన్న ఇండ్ల పరిశీలనకు దాదాపు గంటన్నర సమయం పట్టింది. దారి పొడవునా… జనం జేజేలు హర్షద్వానాలు నడుం జనసేన అధినేత పవన్ కాన్వాయ్ సాగింది.
అయితే మైక్ లేకపోవడంతో… విజయనగరం ప్రజలకు కేవలం… అభివాదం… రెండు చేతులు జోడించడం మాత్రమే పవన్ కల్యాణ్ స్పందించారు. అలాగే ఆర్.అండ్.బీ.,కలెక్టర్ కే.ఎల్.పురం వద్ద జనాలు… బాబు…బాబు కల్యాణ్ బాబు అంటూ అలాగే డప్పులు.. దరువు లతో పవన్ కు స్వాగతం పలికారు. ఇక ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు… దగ్గరుండి… ఎత్తు బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.
ఇక నగరం మొత్తం… యువకులు, యువతులు…చిన్నారులు..పవన్ కు జైజేలు పలికారు. ఇక దారి లో పోలీసు కార్యాలయంలో వద్ద ఇన్ స్పెక్టర్లు..కంట్రోల్ రూమ్ వద్ద పోలీసు ఫోటోగ్రాఫర్లు…కృష్ణ, పద్మనాభం.. ఏఎస్ఐ యూసఫ్ లు…ఓపెన్ టాప్ లో ఉన్న పవన్ చూసి…ఆనందం వ్యక్తం చేయడం విశేషం.