వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో 25వ వార్డు సీతారాంనగర్ లో నిర్మితమౌవుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నూతన దేవాలయానికి కోదాడ వాస్తవ్యులు దూలం యరకల రెడ్డి, వెంకటరామిరెడ్డి, వీరారెడ్డి లు మూడువేల చదరపు అడుగుల గ్రానైట్ బండలను విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూ కులమతాలకు అతీతంగా 25వ వార్డు సీతారాంనగర్ లో దాతల సహాయ సహకారాలతో సర్వాంగ సుందరంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
త్వరలో గుడి నిర్మాణం పూర్తవుతుందని ఆయన వివరించారు. ఇంతటి మహోన్నత కార్యక్రమానికి గ్రానైట్ బహూకరించిన యరకల రెడ్డి, వెంకటరామిరెడ్డి, వీరారెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గుడి నిర్మాణంలో పాలు పంచుకున్న దాతలకు,పలు కార్యక్రమాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో గ్రానైట్ బహుకరించిన దాతలు,ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.