కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి ఏపి ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి నేడు ఢిల్లీలో సమావేశమయ్యారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉంటూ క్యాబినెట్ హోదా పొందిన కిషన్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా కేంద్ర పర్యటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున తెలుగు రాష్ట్రాలలో పర్యాటక అభివృద్ధి పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నో పర్యటక ప్రదేశాలు ఉన్నందున వాటిని అభివృద్ధి పరచడం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చునని ఆయన సూచించారు.
దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.