రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. నేడు ప్రముఖ హీరో శర్వానంద్ బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన పార్క్ లో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్నిచూసి తాను ఆకర్షితుడినై అయి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
రోజు రోజుకు మారుతున్న వాతావరణం విధానంలతో మనం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుందని అలాంటి పరిస్థితి రాకూడదు అంటే మనందరం మొక్కలు నాటాలని ఆయన అన్నారు. అదేవిధంగా తమ ఇంటి పక్కన ఉన్న జిహెచ్ఎంసి పార్కులో యాదాద్రి విధానంలో మొక్కలు పెంచే ఏర్పాటు చేస్తామని, ఈ పార్కును దత్తత తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కి అనిల్ సుంకర( AK ఎంటర్ప్రైజెస్) గోపి ఆచంట, రామ్ ఆచంట (14 రీల్స్) వంశీ, విక్కీ, ప్రమోద్ (UV క్రియేషన్స్) సుధాకర్ చెరుకూరి (SLV)లను మొక్కలు నాటాలని చాలెంజ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ప్రతినిధి కిషోర్ గౌడ్, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.