28.7 C
Hyderabad
May 5, 2024 10: 46 AM
Slider జాతీయం

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సినీనటులు

tv cine artists

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నేడు సినీ నటుడు సయాజీ షిండే మూడు మొక్కలు నాటారు. ముంబయిలోని తన నివాసంలో ఆయన నేడు మూడు మొక్కలు నాటారు. స్థానికంగా దొరికే మొక్కలు నాటడం వల్ల మరింత లాభం ఉంటుందని అక్కడి పర్యావరణానికి ఉపకరిస్తుందని ఈ సందర్భంగా సయాజీ షిండే అన్నారు. తాను నివాసం ఉండే ప్రాంతానికి అనుగుణంగా మామిడి, చింత చెట్లు నాటినట్లు ఆయన చెప్పారు. అదే విధంగా మొక్క నాటిన రోజును గుర్తుంచుకుని ఆ మొక్క పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తానని సయాజీ షిండే చెప్పారు. గ్రీన్ ఇండియా ఉద్యమానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఉద్యమం మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. అదే విధంగా హైదరాబాద్ లో TV ఆర్టిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా TV ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మొక్కలు నాటాలని నిర్ణయించుకుని మొక్కలు నాటారు.

Related posts

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

పెద్ద ఎత్తున నిషేధిత పొగాకు ఉత్పత్తుల పట్టివేత

Satyam NEWS

తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కావాలి

Satyam NEWS

Leave a Comment