మొక్కలు నాటడమే కాదు, అవి ఎదిగేందుకు కావల్సిన వనరులను సమకూరుస్తానని మాజీ మంత్రి, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆయన నేడు మొక్కలు నాటారు. స్థానిక BRR డిగ్రీ కాలేజ్ ఆవరణలో మాజీ మంత్రి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ కృషి అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆయన భావితరాలకు మార్గదర్శకులవుతారని లక్ష్మారెడ్డి కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఎంపీ లక్ష్యం పది కోట్ల మొక్కలు నాటే వరకు కృషి చేయాలని నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన వంతుగా మొక్కలు నాటి , వేరే వాళ్ళని భాగస్వామ్యం చేసే బాధ్యత తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీలో గ్రీన్ ఛాలెంజ్ లో ముఖ్య పాత్ర పోషించిన కాదంబరి కిరణ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
previous post