37.2 C
Hyderabad
May 6, 2024 11: 11 AM
Slider మహబూబ్ నగర్

గుడ్ డెసిషన్: మొక్కలు నాటడమే కాదు వాటిని పెంచుతా

c laxmareddy

మొక్కలు నాటడమే కాదు, అవి ఎదిగేందుకు కావల్సిన వనరులను సమకూరుస్తానని మాజీ మంత్రి, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సి  లక్ష్మారెడ్డి అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆయన నేడు మొక్కలు నాటారు. స్థానిక BRR డిగ్రీ కాలేజ్ ఆవరణలో మాజీ మంత్రి మొక్కలు  నాటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ కృషి అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆయన భావితరాలకు మార్గదర్శకులవుతారని లక్ష్మారెడ్డి కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఎంపీ లక్ష్యం పది కోట్ల మొక్కలు నాటే వరకు కృషి చేయాలని నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన వంతుగా మొక్కలు నాటి , వేరే వాళ్ళని భాగస్వామ్యం చేసే బాధ్యత తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీలో గ్రీన్ ఛాలెంజ్ లో ముఖ్య పాత్ర పోషించిన కాదంబరి కిరణ్,  భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబుకు కొత్త ఆలోచన వచ్చిందోచ్

Satyam NEWS

బస్సు.. గ్యాస్ సిలెండర్ లారీ ఢీ

Sub Editor

ఇలాంటి ముఖ్యమంత్రిని తెచ్చుకున్నందుకు బాధపడుతున్న ప్రజలు

Satyam NEWS

Leave a Comment