25.7 C
Hyderabad
January 15, 2025 19: 18 PM
Slider జాతీయం

రోడ్ అక్సిడెంట్:ఒకే కుటుంబానికి చెందిన10మంది మృతి

maharastra road accsident 10 dead.jpg

మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.యావల్‌ తాలుకాలోని హింగోలా గ్రామ సమీపంలో ఎస్‌వీయూ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.వీరంతా తమ బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ప్రభాకర్‌ నారాయణ్‌ చౌదరి, ఆయన భార్యతో పాటు 8 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో 10 సంవత్సరాల అమ్మాయి ఉంది.శవాలను పోస్టుమార్టం కు తరలించారు.

Related posts

ఘనంగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పుట్టిన రోజు

Satyam NEWS

బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే పిల్లి కూత కూసినట్టు ఉంది

Satyam NEWS

రంజాన్ నెలవంక దర్శనం

Satyam NEWS

Leave a Comment