39.2 C
Hyderabad
May 4, 2024 20: 53 PM
Slider నల్గొండ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ఎంపి

#Badugula Lingaiah Yadav MP

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా నేడు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మొక్కలు నాటారు. ఈ రోజు తన  జన్మదినం కూడా కావడంతో ప్రకృతి పరిరక్షణకు నడుంకట్టారు.

ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. సంతోష్ చేపట్టిన ఇంత మంచి కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సంతోష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారనని అన్నారు.

ఇప్పుడున్న వాతావరణం హెచ్చుతగ్గుదలను సమతుల్యం చేయడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో దోహపడుతుందని ఎంపీ అన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని మరో ముగ్గురుకి ఆయన అందచేశారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సురేష్ రెడ్డి,ఎమ్మెల్యే రవీందర్ నాయక్ దేవరకొండ,ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి లను మొక్కలు నాటాల్సిందిగా కోరారు.

Related posts

కులాలు ప్రాంతాల పేరుతో చిచ్చు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

సైన్టిఫిక్ బట్:మేక పిల్లముఖం అచ్చం మనిషిలా పూజలు

Satyam NEWS

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కుమ్ముక్కు రాజకీయం?

Bhavani

Leave a Comment