రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మణికోండ లోని తన నివాసంలో ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ సృష్టిని కాపాడేందుకు ఒంటికాలిపై తపస్సు చేస్తుంది ఒక్క చెట్టు మాత్రమే అని అన్నారు. ఇది అక్షర సత్యం. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన అన్నారు.
ఆ ఫోటోలను చూస్తుంటే నేలతల్లి పై కూర్చొని తన తల్లికి సేవ చేస్తున్నట్లు కనిపిస్తుందని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది మొక్కలు నాటాలని ఆశిస్తున్నానని ఉదయభాను బ్రహ్మానందం తో చెప్పారు.